
======================================
తెలుగుమీడియాలో ఎన్టీవీది ఓ ప్రత్యేక శైలి. రాజకీయంగా ఈ చానెల్ దూకుడుగా వ్యవహరిస్తుంటుంది. ప్రతిక్షణం ప్రత్యక్ష ప్రసారం అన్న నినాదంతో వచ్చిన ఈ చానెల్ తొలినాళ్లలో ఓబీ వ్యాన్లతో రికార్డ్ సృష్టించింది. తర్వాత పొలిటికల్ ఐటెమ్స్ తో ప్రజల్లోకి దూసుకెళ్లింది. పలువురి ఆదరణ సాధించింది. టాప్ 3లో ఒకటిగా కొనసాగుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ మంచి ఇమేజ్ తో నడుస్తోంది. అయితే మధ్యలో చిన్న చిన్న వివాదాలు వచ్చినప్పటికీ వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతోంది.
అయితూ అనూహ్యంగా ఇప్పుడీ చానెల్ పట్టు కోల్పోతున్నట్టు కనిపిస్తోంది.
ముఖ్యంగా బలమైన హ్యాండ్స్ ని కోల్పోతోంది. పలు మంచి వార్తలు రాయడంలో
సిద్ధహస్తులైన మెరికల్లాంటి జర్నలిస్టులు చానెల్ వీడి వెళ్లడానికి
నిర్ణయించుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ క్యాలెండర్ ఇయర్
లోనే సుమారు పది మంది వరకూ వివిధ కారణాలతో చానెల్ వీడివెళ్లిపోయారు.
ఇంకా మరికొందరు అదే బాట పడుతున్నారు. దానికి కారణాలు కూడా ఆసక్తిగానే
ఉన్నాయి. ముఖ్యంగా ఎన్టీవీ చాలా కాలంగా పెద్ద తలకాయలకు పెట్టింది పేరు.
ఎక్కువ మంది బాసులకు ఇది నిలయం. అయినా ఇప్పుడున్న వాళ్లమధ్య సఖ్యత
లేకపోవడంతో కొంత సమస్యలొస్తున్నట్టు సమాచారం. అంతేగాకుండా క్వాలిటీ
కంట్రోల్ పేరుతో రకరకాల సాకులు చూపిస్తూ నిత్యం వేధిస్తూ ఉండడంతో
పలువురు ఆవేదనకు గురవుతున్నారు. చిన్న చిన్న తప్పిదాలను భూతద్దంలో
చూస్తూ వెంటాడడం చాలామందిని ఇబ్బంది పాలుజేస్తోందంటున్నారు.
వాటికితోడు ప్రస్తుతం మీడియా గడ్డు పరిస్థితుల్లో ఉండడంతో జర్నలిస్టు జీవితాలు అంతంతమాత్రంగా మారుతున్నాయి. ఇక ఎన్టీవీలో అయితే వేతనాలు మూడేళ్లుగా స్తంభించిపోయాయి. ప్రతీ ఏటా ఇంక్రిమెంట్లు వేసే సిబ్బందికి సానుకూల చానెల్ గా ఒకనాడు భావించిన ఎన్టీవీ ఇప్పుడు వాటన్నింటికీ సెలవు చీటి ఇచ్చేసింది. దాంతో జీతాలు అందక..జీవితాలు నెట్టుకురాలేక కొందరు ఎన్టీవీని వీడిపోతున్నట్టు కనిపిస్తోంది. ఇక చైర్మన్ వ్యవహారశైలి కూడా సానుకూలంగా లేదని ప్రచారం సాగుతోంది. మొత్తంగా కారణాలేమయినప్పటికీ ఇప్పుడు డెస్క్ ఇన్ ఛార్జ్ హరికృష్ణతో పాటు సీనియర్లు రామిరెడ్డి, పద్దయ్యవంటి వారు కూడా ఇంటిదారి పట్టడం ఎన్టీవీకి మంచి క్వాలిటీ హ్యాండ్స్ కరువయినట్టే భావించాల్సి ఉంటుంది.
వాటికితోడు ప్రస్తుతం మీడియా గడ్డు పరిస్థితుల్లో ఉండడంతో జర్నలిస్టు జీవితాలు అంతంతమాత్రంగా మారుతున్నాయి. ఇక ఎన్టీవీలో అయితే వేతనాలు మూడేళ్లుగా స్తంభించిపోయాయి. ప్రతీ ఏటా ఇంక్రిమెంట్లు వేసే సిబ్బందికి సానుకూల చానెల్ గా ఒకనాడు భావించిన ఎన్టీవీ ఇప్పుడు వాటన్నింటికీ సెలవు చీటి ఇచ్చేసింది. దాంతో జీతాలు అందక..జీవితాలు నెట్టుకురాలేక కొందరు ఎన్టీవీని వీడిపోతున్నట్టు కనిపిస్తోంది. ఇక చైర్మన్ వ్యవహారశైలి కూడా సానుకూలంగా లేదని ప్రచారం సాగుతోంది. మొత్తంగా కారణాలేమయినప్పటికీ ఇప్పుడు డెస్క్ ఇన్ ఛార్జ్ హరికృష్ణతో పాటు సీనియర్లు రామిరెడ్డి, పద్దయ్యవంటి వారు కూడా ఇంటిదారి పట్టడం ఎన్టీవీకి మంచి క్వాలిటీ హ్యాండ్స్ కరువయినట్టే భావించాల్సి ఉంటుంది.
Comments
Post a Comment