mapalle
-------

వాయిస్1:
పచ్చని చీర కట్టుకున్న పల్లె తల్లి. కుల మతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి జీవించే గ్రామ సీమ.
ఏ ఇంట్లో శుభ కార్యం జరిగినా తలో చేయి వేసి సహకరించే గ్రామ సంస్కారం. ఏ కంట్లో నీళ్లు తిరిగినా ప్రతి కన్ను కన్నీరు పెట్టుకునే
జాలి గుండె కలిగిన పల్లెటూరు.కమ్మరి కొలిమి, కుమ్మరి సారె, వడ్రంగి పెద్దబాడిసె, కంసాలి సుత్తి, తోలు చెప్పులు కుట్టె వీధి గుడారం, మనిషి
మానాన్ని కాపాడే సాలె మగ్గం..దేశానికి అన్నం పెట్టేందుకు పొలాలు దున్నే రైతన్న హలాలు. పనులన్నీ అయ్యాక కబుర్లకు చిరునామా
రచ్చబండ. ఎక్కడ చూసినా ప్రశాంతత, మానసిక ఆనందం వెల్లివిరిసే చిన్న గ్రామం రాజన్న పేట. ఎందరో కళాకారులకు, సాహితీ
వేత్తలకు, ప్రజా నేతలకు జన్మనిచ్చిన కన్నతల్లి కరీంనగర్ జిల్లా. ఈజిల్లాలోనే వుంది రాజన్న పేట గ్రామం. ఎల్లారెడ్డిపేట మండలం, సిరిసిల్లా
అసెంబ్లీ నియోజక వర్గంలో వున్న ఈ ఊరు పిల్లగాలులకు తలలాడించే పచ్చని పొలాలతో, గలగలా సవ్వడి చేసే చెరువులతో, కల్మషంలేని
పల్లె ప్రజల చిరునవ్వులతో కాలం గడుపుతోంది.
వాయిస్2:
రాజన్న పేట గ్రామం ఒకప్పుడు ఇలా వుండేది కాదు.ఎన్నో ఆటుపోట్లను
 ఎదుర్కుంది. ఎన్నో విషాదాలను, ఎన్నో మానసిక వేదనలను కడుపులో
దాచుకుంది. మంచికి ప్రాణం ఇచ్చే ఈ పల్లె చెడును ఎదురించే బల్లెం 
అయింది.పురిటినొప్పులకు బయపడని తల్లి లాగా పొరాటాలకు
వెనకంజ వేయని పల్లె ఇది.అందుకే రాజన్న పేట ఊరంటే 
జిల్లా జిల్లంతా చర్చించుకుంటుంది.

వాయిస్3: ఈ రాజన్న పేటది ఇప్పటి చరిత్ర కాదు. తరాల చరిత్ర కలిగిన ఘనమైన పేట. రజాకారులను గడగడలాడించిన వీరపల్లె.
తెలంగాణా పోరాటంలో బరిగీసి నిలిచిన ధీర పల్లె. వ్యవసాయం ప్రధాన ఆధారంగా, ఆదాయంగా కలిగిన ఈ వూరు పై అనాటి నిజామ్
ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది.1948లో రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేసి నిజాం రాజులకు చెమటలు పట్టించింది ఈ పల్లె. 1969లో ప్రత్యేక
తెలంగాణ పోరాటంలో ముందు నడిచింది ఈ గ్రామం. అనంతరం దోపిడికి వ్యతిరేకంగా జరిగిన నక్సలైట్ ఉద్యమానికి ఈ గ్రామం లోని కొంత మంది ఆకర్షితులయ్యారు.
1992లో కని విని ఎరుగని ఉపద్రవం వచ్చిపడి ఈ పల్లెని వణికించింది. ఇక్కడ జరిగిన అతిపెద్ద ఎన్ కౌంటర్ లో 7గురు నక్సలైట్స్
మరణించారు. ఈ కారణంగా ఏర్పడిన పలు ఆటంకాల వలన గ్రామస్తులు చాలా మంది గల్ఫ్ బాట పట్టారు. కొంత కాలం తర్వాత గల్ఫ్ నుంచి
తిరిగి వచ్చిన ప్రజలు ఉద్యమాన్ని మాత్రం మరచిపోలేదు. కెసిఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మలి విడత ప్రత్యేక తెలంగాణ పోరాటంలో విశేషంగా పాల్గొన్నారు.

వాయిస్4:
పల్లెటూల్లే దేశానికి పట్టుకొమ్మలన్నాడు మహాత్మా గాంధీ. గ్రామాలు అభివృద్ధి చెందితే దేశం కూడా అభివృద్ధి చెందుతుందని మననేతలు సైతం విశ్వసిస్తున్నారు.
అందుకే అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తున్నాయి. అందులో భాగంగానే రాజన్న పేట గ్రామాన్ని
సిరిసిల్లా శాసన సభ్యులు, రాష్ట్ర మంత్రివర్యులు కెటిఆర్ దత్తత తీసుకున్నారు. రాజన్న పేట గ్రామ ప్రజల కళ్లల్లో ఆనంద భాష్పాలు. 6వేల జనాభాతో, 4వేల
ఓటర్లు వున్న ఈ గ్రామం అభివృద్ధి బాటలో పరుగుతీస్తోంది. మట్టి బాటలతో వున్న గ్రామం సిసి రోడ్లతో అలంకరించుకుంది. రక్షిత మంచినీరే
కాకుండా మినరల్ వాటర్ ప్లాంట్ కూడా వచ్చి ప్రజల దాహార్తిని తీరుస్తున్నాయి. వీధి దీపాల వెలుగుల్లో గ్రామం శోభాయమానమయింది. మిషన్
కాకతీయ పథకంతో ఒక చెరువు సొగసులద్దుకుంది. ఊరిలో వున్న మరో చెరువు త్వరలో అభివృద్ధి చెందనుంది. హరితహారం కార్యక్రమానికి ముందే
ఊరు మెత్తం దారి పొడవున నాటిన మొక్కలతో గ్రామం ఆకుపచ్చ రంగు పులుముకుంది. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించి గ్రామస్తుల చింతలను తీర్చింది
మన సర్కార్. అర్హులందరికి రేషన్ కార్డులతో, అన్ని ప్రభుత్వ పథకాలు అందుకుంటూ గ్రామం సంతృప్తిగా వుంది. ఇక కెసిఆర్ ప్రవేశ పెట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు
త్వరలో వస్తే తమ స్వంత ఇంటి కలలు సాకారం అవుతాయని గ్రామస్తులు ఆశగా ఎదురు చూస్తున్నారు. గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తున్న
కెటిఆర్ కు, అన్ని విధాల సహాయ సహకారాలందిస్తున్న కెసిఆర్ కు ప్రజలు కృతజ్ఞతాభివందనాలు తెలుపుకుంటున్నారు.          

Comments

Post a Comment