ఉడుములు :

=> ప్రతినిత్యం మానవుని అన్వేషణలో దేనిలో ఏముందో కనిపెట్టి దానిని ఏదో విధంగా జీవన సరళికి వినియోగించుకుంటూ, ఆరోగ్యాన్నీ, ఐశ్వర్యాన్ని పొందుతున్నాడు. ఆ విధంగా ఉపయోగపడే ప్రాణుల్లో ఉడుము ఒకటి.
=> ఉడుము శాస్త్రీయ నామం వరానస్. ఇది వరనిడారు కుటుంబానికి చెందిన మాంసాహార బల్లులు. వీటిలో అతిపెద్ద ఉడుము కొమొడొ డ్రాగన్. వీటి ఉనికి ఆఫ్రికా, ఇండియా, శ్రీలంకా, చైనా, ఇండోనేషియా, ఫిలిప్పిన్స్, ఆస్ట్రేలియా దేశాలు, అలాగే ఇండియాకి, చైనాకి దగ్గరగా ఉన్న సముద్ర దీవుల్లోను ఎక్కువగా నివసిస్తాయి.
=> ఉడుములు సాధారణంగా పెద్ద సరీసృపాలు. అన్నింటికన్న చిన్నదైన ఉడుము 12 సె.మీ. పొడవున్నది. వీటికి పొడవైన మెడ, పంజా, గోర్లు కలిగిన బలమైన కాళ్ళుంటాయి. సుమారుగా అన్ని ఉడుములు మాంసాహారులు. ఇవి గుడ్లను పెడతాయి. ఒకసారి 7 నుండి 37 గుడ్లు పెట్టి వాటిని మట్టితో కప్పి ఉంచుతాయి, లేదా బోలుగా ఉన్న వృక్షాలలో దాచిపెడతాయి. ఇందులో అనేక జాతులు ఉన్నాయి. ఈ ఉడుములు చాలా తెలివిగలవి. వీటికి పొడవైన మెడ, శక్తివంతమైన తోక, అవయవాలు ఉండి కాళ్ళు నాలుగూ చాలా బలిష్టంగా ఉంటాయి.

=> ఉడుము అనగానే చరిత్ర తెలిసిన చాలామందికి శివాజీ గుర్తుకు వస్తాడు. ఛత్రపతి శివాజీ ఈ ఉడుముల్ని ప్రత్యేకంగా పెంచేవాడు. వీటి నడుముకు పెద్ద వెూకులు, తాళ్ళు కట్టి, మూతికి బెల్లం పాకం రాసి శత్రువుల కోటగోడల వద్ద పైకెక్కించేవాడు. అవి పూర్తిగా పైదాకా ఎక్కిన తరువాత ఆ తాడు కొద్దిగా లాగితే ఆ ఉడుము గోడ చివరి భాగాన్ని గట్టిగా పట్టు కున్ని ఉండేది. ఇక ఆతాడుతో శివాజీ సైన్యంతో సహా కోటగోడలు ఎక్కి ముట్టడించేవాడు.
=> ఉడుముల చర్మం నుంచి తయారుచేసిన తైలం పక్షవాతం వచ్చిన వారికి మంచి ఔషధం, అడపాదడపా శరీరానికి ఈ ఉడుము చమురు మర్ధనా చేసుకుని ఒక గంట ఆరనిచ్చి స్నానం చేస్తే, శరీరం వజ్రకాయంగా, ధృఢంగా తయారవుతుంది.
=> కొన్ని వ్యాధులకి ఉడుము మాంసంతో చేసిన బిరియానీ వంటకాలు ఔషధంగా ఉపయోగపడతాయి. నేడు మల్ల యోధులు శరీర ధారుడ్యానికి ఉడుము చమురుని ప్రత్యేకంగా వాడుతున్నారు. చైనాలోను, కేరళ తెలంగాణ అటవీ ప్రాంతాల వారు ఉడుములను ఆహారంగా తీసుకుంటారు.
=> గత కొన్ని సంవత్సరాల క్రితం మన హైదరాబాద్ నగరంలో కోటీ మార్కె ట్టులో కూడా ఉడుములు అమ్మేవారు. ఉడుము మాంసంతో చేసిన వంటకాలు తీసుకున్నా, ఉడుము చమురు లేపనం చేసుకున్నా శరీర కండరాలు బలిష్టంగా తయారవ్వడమే కాకుండా శృంగారపరమైన శక్తిని కూడా పెంచుతుంది.
=> అయితే వీటిలో కొన్ని జాతులు విషపూరితమైనవి. అందువలన వీటిని పెంచే వారికి మాత్రమే వీటి గురించి తెలుస్తుంది.
జీవకారుణ్య సంఘాలు ఉద్భవించిన తరువాత వీటి వాడకం కొంత తగ్గిందనే చెప్పవచ్చు. కానీ, ప్రత్యేకమైన పరిస్థితులు లేకపోవడం వల్ల వీటి ఉత్పత్తి బాగా పెరిగింది.
** తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలో ఉడుము ఇంట్లో తిరిగితే అరిష్టం అని ఇంటిని కొన్ని రోజులపాటు విడిచి పెట్టడం జరుగుతుంది, అలాగే ఉడుమును ఇంట్లో వండటం నిషిద్ధం కేవలం బయట మాత్రమే వండుకొని తినాలి.
Comments
Post a Comment