పాలమూరులో టిఆర్ఎస్ కు జేజమ్మ షాక్

పాలమూరులో టిఆర్ఎస్ కు జేజమ్మ షాక్

పాలమూరులో టిఆర్ఎస్ కు జేజమ్మ షాక్ (వీడియో)
ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ పాలమూరు రాజకీయాలు ఆసక్తికరంగా 
మారుతున్నాయి. దేవరకద్రలో కాంగ్రెస్ నాయకురాలు, మాజీ మంత్రి డికె 
అరుణ పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె ఒక టిఆర్ఎస్ మహిళా 
సర్పంచ్ తో పాటు పెద్ద సంఖ్యలో టిఆర్ఎస్ కార్యకర్తలకు కండవా కప్పి 
కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. దీంతో ఒక్కసారిగా పాలమూరు 
రాజకీయాలు వేడెక్కాయి.
 మహబూబ్ నగర్ జిల్లా, దేవరకద్ర నియోజకవర్గం, మూసాపేట మండలంలోని జానంపేట సర్పంచ్ చెన్నమ్మతోపాటు తాళ్లగడ్డఅచ్చయపల్లికందూర్ గ్రామాల నుండి టిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు చెన్నమ్మబాలమ్మసత్యమ్మదేవమ్మమల్లేష్,హామీర్తిరుపతయ్యఅంజన్ననాగరాజు గౌడ్వెంకటయ్య గౌడ్వార్డ్ మెంబర్ నాగన్నవెంకటయ్యసాతర్ల శ్రీనివాసులుమండ్ల మన్యంకొండసాతర్ల ఆంజనేయులుప్రదీప్ కుమార్లక్ష్మణ్గట్టు ఆంజనేయులుమనోహర్శ్రీనివాస్బుచ్చయ్యశ్రీకాంత్ తదితరులు డికె అరుణ సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరారు. ఈ కార్యక్రమం దేవరకద్ర నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి డోకూర్ పవన్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది.
ఈ సందర్భంగా డికె అరుణ మాట్లాడుతూ అటు టిఆర్ఎస్ పార్టీపై నిప్పులు చెరిగారు. అలాగే సొంత పార్టీ నేతలకు కూడా పరోక్షంగా చురకలు వేశారు. 
ఈ కార్యక్రమంలో మూసాపేట మండల అధ్యక్షులు బాలనర్సింహులుఅడ్డాకుల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగిరెడ్డిసురేందర్ రెడ్డిసి.హెచ్. గోవర్ధన్,శెట్టి శేఖర్సమరసింహా రెడ్డిరాజేందర్ రెడ్డిసూర్యప్రకాష్రాముకుమార్కుమ్మరి నరసింహ,  జామీర్నాగేష్కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

Comments